Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : వి.కోట ఫేమస్ టీవీ న్యూస్ : చిత్తూరు జిల్లా,వి.కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లికి చెందిన ముగ్గురు యువకులు మూడ్రోజుల క్రితం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే... దీంతో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మండల టీడీపీ నాయకులతో కలసి శనివారం మోట్లపల్లిలో బాధిత కుటుంబీకులను కలసి పరామర్శించారు. ఈ సందర్బంగా సంఘటన జరిగిన తీరును మృతుల కుటుంబీకులు వివరించి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఒకే కుటుంబానికి ముగ్గురు చిన్నారుల మృతి తనను కలచి వేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విధి రాతను ఎవరు తప్పించలేమని ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. పుత్ర శోకాన్ని కలిగించే ఇలాంటి సంఘటనలను గుర్తించి పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని వారిలో భరోసా నింపారు. ఈ పరామర్శ కార్యక్రమలో నాయకులు రంగనాథ్, రాంబాబు, ఈశ్వర్ గౌడ్, ధీరజ్, శబరీష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV