Thursday, 11 June 2026 10:53:33 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మట్టి వినాయకుడిని పూజించండి

ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు

Date : 16 September 2023 06:04 PM Views : 1559

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మట్టితో చేసిన వినాయకుని పూజించి పర్యావరణ రక్షణకై నడుంకట్టాలని డాక్టర్ అంకయ్య పిలుపునిచ్చారు.మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాతవీరాపురం నందు ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా విద్యార్థులందరిచే మట్టి వినాయకుని బొమ్మలను తయారుచేయించి వివిధ రకాల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వే ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాతవీరాపురం విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను చాలా చక్కగా తయారు చేశారని పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్న కళ ను వెలికి తీసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. సోమవారం రోజు జరుపుకోబోయే వినాయక చవితి రోజున దేశమంతా అందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని పూజించి పర్యావరణం కలుషితం కాకుండా భావితరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందించాలని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో తెలుగు పండితులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వే ఫౌండేషన్ వారు వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మంచి సందేశం ఇస్తుంటారని పిల్లలందరూ ఈ కార్యక్రమం ద్వారా భావితరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విష రసాయనాలతో కూడిన గణపతి విగ్రహాలను వాడకుండా మట్టి వినాయకుడిని పూజించడం ఎంతో శ్రేయస్కరమని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అందంగా బొమ్మలు తయారుచేసిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు. పిల్లలు తయారుచేసిన విగ్రహాలు అతిథులను,గ్రామస్తులను, చూపరులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ వెంకటేశ్వర్లు, ఉషారాణి,అంగన్వాడీ కార్యకర్తలు,వే ఫౌండేషన్ వినోద్,చంద్ర శేఖర్ మరియు విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :