Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయ ధర్మకర్త దొడ్ల కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం వినాయక చవితి వారోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడ ఛైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త దొడ్ల కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వారోత్సవాల్లో భాగంగా ఏటా తుమ్మలగుంట లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గురువారం సుమారు 600మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధనుంజయ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, లోకేష్ నాయుడు,తేజ, నితీష్,హరి,చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV