Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శనివారము శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి , అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ తో వైద్య ఉద్యోగుల సమస్యలపై జాయింట్ మీటింగ్లో చర్చిస్తున్న ఏ.పి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి. గిరిబాబు, తిరుపతి పట్టణ ఏపీ ఎన్జీవోస్ నగర అధ్యక్షులు ఎస్.సురేష్ బాబు, మరియు బ్రాంచ్ అధ్యక్షుడు వీర కిరణ్, కార్యదర్శి కే సి సుబ్రమణ్యం. ఈ సందర్భంగా వైద్య ఉద్యోగుల సమస్యల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ , ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తున్నారని కొన్ని జటిలమైన సమస్యల్ని ప్రతి రెండో శనివారము జాయింట్ మీటింగ్ లో చర్చించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఔట్సౌర్సింగ్ ఉద్యోగుల పిఎఫ్, ఈ ఎస్. ఐ , ధనలక్ష్మి అనే ఉద్యోగికి రావలసిన 3 నెలల వేతనం చెల్లించాలని కోరినారు. విశ్వనాధ్ అనే తోటి ఉద్యోగికి రికార్డ్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించాలని తెలిపారు. ప్రతి రెండో శనివారం పని చేస్తున్న వారికి ( సీ.సీ.ల్) కంపెన్సేటరి కేజువల్ లీవ్ మంజూరు చేయాలని కోరినారు. పలు సమస్యలపై ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు మీ ఉద్యోగస్తుల సమస్యల్ని మాకు తెలియపరిచినట్లయితే యూనియన్ ద్వారా సానుకూలంగా స్పందించి సమస్యని తీర్చగలమని తెలియపరిచారు. యూనియన్ నాయకులు సమస్యలపై వినతి పత్రాన్ని ప్రిన్సిపాల్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మిన్ ) డాక్టర్ సునీత (అకాడమిక్ ), సిద్ధారెడ్డి, భక్తవత్సలం, వైద్య ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV