Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, ఆగష్టు 6 : తిరుపతి ఎస్. వి. హై స్కూల్ 1984-85 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం గంగిరెడ్డీ పల్లె సమీపంలోని మామిడి తోటలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా స్నేహితులు ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకొని వారికి చదువు చెప్పిన గురువులను స్మరించుకొని, తమతో చదువుకొని మరణించిన స్నేహితులకు రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన తమ మిత్రుడు నాగరాజును ఆర్ధికంగా ఆదుకొన్నట్లే, పరస్పరం సహాయాసహకారాలు అందించుకోవాలని, ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్స్ నిత్వహించుకోవాలని తీర్మానించారు. కార్యక్రమం అధ్యంతం మిత్రుల పలకరింపులు, కేరింతలతో ఉత్సాహంగా జరిగింది. సుమారు 150 మంది స్నేహితులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్థసారథి, లోకేష్, మునికేశవులు, సతీష్ కుమార్, శ్రీధర్ నాయుడు, ఈశ్వరసింగ్, హేమేంద్ర, నరహరి, రమేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ముంగర రమేష్, రఘు రాయల్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV