Thursday, 11 June 2026 10:44:26 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి..

Date : 29 April 2026 08:05 PM Views : 406

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై నిరంతర అవగాహన కల్పించాలి.. పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. మదనపల్లి/పుంగనూరు/చౌడేపల్లి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది అత్యంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిశీలించి చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారితో కలిసి పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పెండింగ్ కేసుల వివరాలను, స్టేషన్ పరిధిలోని నేరాల తీరును ఆరా తీశారు. పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, లాకప్ గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు, కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. *ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..* సమాజంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతివారం మహిళా పోలీసుల సమన్వయంతో పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైమ్‌పై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు. ఆపద సమయంలో మహిళల భద్రత కోసం రూపొందించిన 'శక్తి యాప్' ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. *సీసీ కెమెరాలే కీలకం..* నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, అధికారులు, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేసి రాబోయే 'లోక్ అదాలత్'లో అత్యధిక కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యేలా చూడాలని, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ శ్రీమతి బి. పావని, పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, పుంగనూరు ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ, చౌడేపల్లి ఎస్ఐ చిన్నరెడ్డప్ప తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :