Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాన్ సుష్మ "ఎక్లిప్టా ప్రోస్ట్రాటా ఆధారిత మెగ్నీషియం ఆక్సైడ్ నానోపార్టికల్ యొక్క యాంటీ-డయాబెటిక్ యాక్టివిటీ మరియు స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలపై వాటి పని తీరు" అనే అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్ట్ను పొందారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో మధుమేహం పరిశోధన మరియు చికిత్స రంగాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్. మన్నూర్ ఇస్మాయిల్ షేక్, మలేషియా, మరియు ప్రొఫెసర్ జాన్ సుష్మా లను, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, మరియు బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జోస్త్న, మరియు అధ్యాపకులు ప్రొఫెసర్ ఆర్. ఉష, ప్రొఫెసర్ కిశోరీ అభినందించారు.
Admin
Famous TV