Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా,పుంగనూరు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని అందులో భాగంగా పుంగనూరు మండల సమావేశం మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు యం.జగదీష్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తద్వారా కాలుష్యం తగ్గుతుందని తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికా రాణి అరవపల్లి వెంకటరెడ్డి,చంద్ర శేఖర్ రాజు,టివిఎస్ ప్రసాద్, రమేశ్,డాక్టర్ జగన్నాథం,వెంకటేష్,నాగరాజ,రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV