Friday, 12 June 2026 01:50:07 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తిరుపతి కేంద్రంగానే తెలుగు అకాడమీ

అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి

Date : 29 June 2023 05:39 PM Views : 984

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి కేటాయించిన తెలుగు అకాడమీ కేంద్ర కార్యాలయం తిరుపతి నుంచి పని చేస్తోందని ఎలాంటి అనుమానం వద్దని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.కార్యాలయం పని తీరు, నిర్వహణ తిరుపతి కేంద్రంగా జరపకపోవడం పట్ల అభ్యంతరం తెలిపింది రాయలసీమ మేధావుల ఫోరం. ఇదే సమయంలో పలు తెలుగు భాషా సాంస్కృతిక సంస్థలు ఈ మధ్యనే సమావేశం కావడం తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ పూర్తి స్థాయిలో పని చేయాలని తరలింపు అనుమానాలు నివృత్తి చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో తిరుపతి పర్యటన కొచ్చిన అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కార్యాలయ నిర్మాణం కోసం రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాకం నాగరాజు తో కిలిసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టల పరిశీలన చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి RDO రామారావు ఏర్పేడు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని లక్ష్మీ పార్వతికి చూపించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ వికేంద్రీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత అంశం. వికేంద్రీకరణ కోసం ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ద తీసుకుంటుందో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న తెలుగు అకాడమీని ఏపీ కి తీసుకురావడానికి కనీస ప్రయత్నం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అకాడమీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకురావడం కోసం మొదట హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి సాధించిన విషయం గుర్తు చేశారు ఆర్థిక పరిమితులు, తెలంగాణ తో న్యాయ వ్యాజ్యం తర్వాత అకాడమీని గత రెండు సంవత్సరాలుగా నడుపుతున్నాము. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతుంది. స్థలం ఎంపిక చేసుకుని కార్యాలయం నిర్మానం కూడా చేస్తామని తెలిపారు. రాయలసీమ ప్రజలు అడగకుండానే తిరుపతి కి తెలుగు అకాడమీని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్థ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని వికేంద్రీకరణ విషయంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనుమానాల నివృత్తి చేసిన లక్ష్మీ పార్వతికి గారికి ధన్యవాదాలు కార్యాలయం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో బాటు కార్యాలయ పూర్తి స్థాయి కార్యకలాపాలు కూడా తిరుపతి కేంద్రంగా చేసుకుని నిర్వహణ జరిగేలా చూడాలని రాయలసీమ మేధావుల ఫోరం విజ్ఞప్తి చేస్తుంది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :