Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఈనెల 3న చేరిన కుమార్ రాజు సోమవారం తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ముండలంలోని శెట్టిపేట పంచాయతీ తోటకూరపల్లికి చెందిన కుమార్ రాజు తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పలువురి ప్రలోభాలికి గురై అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి చేరడం జరిగిందని అయితే సొంత తల్లికి మోసం చేయడం తగదని తెలుసుకొని మరల తెలుగుదేశం పార్టీలో చేరినట్లు కుమార్ రాజు తెలిపారు తన తప్పు తెలిసి వచ్చిందని ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు పురుషోత్తం రాజు,శ్రీధర్ రాజు (గిరిరాజు) శంకర్ రాజు తదితరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం కండువా కప్పుకుని పార్టీలోకి చేరినట్లు ఆయన వివరించారు ఇకపై తన జీవితకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని కుమార్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్,అర్జున్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV