Friday, 12 June 2026 01:42:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

చిట్టత్తూరు కాళేపల్లిలో వైసీపీ సర్పంచ్ టిడిపి పార్టీలో చేరిక

వైసీపీ పతనం ఆరంభమైంది ‌‌.. పులివర్తి నాని

Date : 03 March 2024 06:21 PM Views : 676

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రామచంద్రాపురం మండలం, చిట్టత్తూరు కాళేపల్లి వైసీపీకి చెందిన సర్పంచ్ చిరంజీవి రెడ్డి తన అనుచరులతో కలిసి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడామన్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న రాయలచెరువు సమస్య పరిష్కారించ లేదని వాపోయారు. చెరువు కలుషితమై గ్రామస్తులు రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీపీ దగ్గర బంధువు చనిపోయిన పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి పట్టా భూముల్లో తుడా రోడ్లు వేశారని చర్యలు తీసుకోమన్నా స్పందించలేదని మండిపడ్డారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు.. ప్రశ్నించే హక్కు లేదు.. నిలదీసే గొంతు లేకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. బానిస సంకెళ్లు విముక్తి.. పులివర్తి నాని గెలుపు తోనే సాధ్యమని సర్పంచ్ చిరంజీవి స్పష్టం చేశారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి పార్టీలోకి వస్తున్న సర్పంచ్ చిరంజీవి రెడ్డి కి ఆయన వర్గీయులకు స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో రాయలచెరువును అభివృద్ధి చేస్తానని చెప్పాను‌. ఓడి పోయి చేయలేక పోయాను. రాయలచెరువు ను ప్రాజెక్టు గా తీర్చిదిద్దుతాను. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తా.. అనుపల్లిలో 150 ఎకరాలు తీసుకుని కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారు. వైజాగ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏవిధంగా నష్టం సంభవించిందో అలా జరగవచ్చున్నారు‌. అలాగే తలకోనతో పాటు రాయలచెరువును పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని అన్నారు. రామచంద్రాపురంను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తిరుపతి నుంచి ఆర్సీ పురంకు 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళుతానన్నారు. వైసీపీ పతనం మొదలైందని, వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :