Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రామచంద్రాపురం మండలం, చిట్టత్తూరు కాళేపల్లి వైసీపీకి చెందిన సర్పంచ్ చిరంజీవి రెడ్డి తన అనుచరులతో కలిసి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడామన్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న రాయలచెరువు సమస్య పరిష్కారించ లేదని వాపోయారు. చెరువు కలుషితమై గ్రామస్తులు రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీపీ దగ్గర బంధువు చనిపోయిన పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి పట్టా భూముల్లో తుడా రోడ్లు వేశారని చర్యలు తీసుకోమన్నా స్పందించలేదని మండిపడ్డారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు.. ప్రశ్నించే హక్కు లేదు.. నిలదీసే గొంతు లేకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. బానిస సంకెళ్లు విముక్తి.. పులివర్తి నాని గెలుపు తోనే సాధ్యమని సర్పంచ్ చిరంజీవి స్పష్టం చేశారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి పార్టీలోకి వస్తున్న సర్పంచ్ చిరంజీవి రెడ్డి కి ఆయన వర్గీయులకు స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో రాయలచెరువును అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఓడి పోయి చేయలేక పోయాను. రాయలచెరువు ను ప్రాజెక్టు గా తీర్చిదిద్దుతాను. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తా.. అనుపల్లిలో 150 ఎకరాలు తీసుకుని కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారు. వైజాగ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏవిధంగా నష్టం సంభవించిందో అలా జరగవచ్చున్నారు. అలాగే తలకోనతో పాటు రాయలచెరువును పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని అన్నారు. రామచంద్రాపురంను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తిరుపతి నుంచి ఆర్సీ పురంకు 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళుతానన్నారు. వైసీపీ పతనం మొదలైందని, వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Admin
Famous TV