Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పులికాట్ ముఖద్వారం పూడిక తీత గురించి పరుష పదజాలంతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హామిని విస్మరించారు అనే లోకేష్ విమర్శలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. గూడూరు నియోజకవర్గం రాయదొరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తొలగించే కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సూచనలతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న విషయం అందరికీ విధితమే ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖను సంప్రదించగా కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ రాసారని మత్స్యశాఖ అనుమతి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతితో రూ.128 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో పూడిక తీత పనులు జరుగుతాయి అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్న విషయం పాపం లోకేష్ కి తెలిసినట్లు లేదు, మాట్లాడేందుకు సమస్యలు ఏమి లేక నోటికొచ్చింది మాట్లాడటం చేతికి రాసిచ్చింది చదవడం ఊక దంపుడు ఉపన్యాసాలతో మత్స్యకారులపై కపట ప్రేమ వలకబోస్తున్నాడని ఎంపీ గురుమూర్తి ఎద్దేవా చేసారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకారులకు అండగా ఉండేందుకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకంతో 21 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన 1.32 లక్షల మందికి మత్స్యకార భరోసా కింద 10 వేల రూపాయలు అందిస్తూ మత్స్యకారులకి ఏదైనా మేలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ఆదర్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ఆయన అన్నారు
Admin
Famous TV