Friday, 12 June 2026 12:27:32 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఏపీలో అన్నదాతకు జగన్ సర్కార్ శుభవార్త.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు

Date : 09 June 2023 11:06 AM Views : 645

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : రైతులకు జగన్ సర్కార్ గొప్ప శుభవార్తనందించింది. రైతులకూ ఊరటనిస్తూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. దళారీ వ్యవస్థకు బ్రేకులు వేస్తూ రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపట్టింది. దళారీ వ్యవస్థకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము జమ చేయనుంది. పౌరసరఫరాల శాఖలో ఇలాంటి అనే మార్పులు తీసుకొచ్చిందని ఆ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని.. రబీ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమన్నారు. ఇందులో రూ.28,402 కోట్లు విలువైన 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. పౌరసరఫరాల శాఖలో జగన్‌ సర్కార్‌ అనే మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతుల నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.28,200 కోట్లను రైతులకు చెల్లించామని.. మిగిలిన సొమ్మును త్వరలోనే జమ చేస్తామని చెప్పారు మంత్రి కారుమూరి. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థను విపరీతంగా ప్రోత్సహించారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాలశాఖకు భారీగా అప్పులు చేశారని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :