Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి మండలానికి మరో తహసీల్దార్ కావలే..! అని స్థానికులు కోరుతున్నారు. తహసీల్దార్ గా ధ్వారకానాథ్ రెడ్డి బాధ్యలు చేపట్టిన తర్వాత పత్రికల్లో,ప్రసార మాధ్యమాల్లో ఎన్నో భూ సమస్యలు ప్రచురితమైనా కనీసం స్పందించకపోగా కోర్టు కేసులు కోసం సమయం కేటాయిస్తూ వున్నారన్న విమర్శలు వెల్లువెత్తనున్నాయి.రాజీవ్ నగర్,గంగలపూడి,రాచ గున్నేరి తదితర గ్రామాల్లో ఎన్నో భూ కుంభకోణాలను పలు పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నా కార్యాలయానికే తహసీల్దార్ పరిమితమై ప్రభుత్వ భూములు.ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే ఊకదంపుడు మాట చెప్పి భూ సమస్యలపై దృష్టి సారించలేకపోతూ వున్నారన్న విమర్శలను తహసీల్దార్ మూట గట్టుకుంటున్నారు.గత మూడు మాసాల్లో వచ్చిన ఏ భూ సమస్యపై తహసీల్దార్ కనీసం క్షేత్ర పరిశీలన చేసిన దాఖలాలు లెవంటే అతిసయోక్తి కాదేమో.కనీసం రెవెన్యూ సిబ్బంది కూడా భూసమస్యలను గాలికొదిలేసి హస్తలాగవం వచ్చే పనుల్లో బిజీగా వున్నారనే విమర్శలు వస్తున్నాయి.జటిలమైన భూసమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూ సమస్యలు పరిష్కరించాల్సిన తహసీల్దార్,రెవెన్యూ సిబ్బంది కనీసం కన్నెత్తి చూడకుండా వుండడం చూస్తే అసలు శ్రీకాళహస్తి రెవెన్యూ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి,సిబ్బంది పనిచేస్తున్నారా.. అనే అనుమానం వస్తుంది.ఎన్నో భూ సమస్యలు వెలుగులోకి వస్తుంటే రెవెన్యూ అధికారి ఎందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించడం లేదో అవగతం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ తహసీల్దార్ కానీ,రెవెన్యూ సిబ్బంది కానీ క్షేత్రస్థాయిలో భూసమస్యలను పరిసకరించేందుకు చర్యలు తీసుకుంటే ఎక్కడ రాజకీయ నాయకులు నుంచి ఒత్తిళ్లు వస్తాయోమో..? లేదా బదిలీ వేటు పడుతూందేమోనని భయాందోళనలతో వున్నారా..? అనే సందేహం కలుగుతుంది.అందువల్ల రెవెన్యూ అధికారి,సిబ్బంది జటిలమైన భూ సమస్యపరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.మరి భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారి,సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Admin
Famous TV