Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు తేదీ 8-11-23 విజయవాడ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ DSVL నరసింహం ని కలిసి ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు. వైద్య విద్యా విభాగంలోని వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని అడగగా అంగీకరించి వెంటనే ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర వైద్య విద్య సంచాలకు. ఈనెల నవంబర్ 17-11-23 తేదీ శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేయండి అని డిప్యూటీ డైరెక్టర్ అప్పారావు కి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యా సంచాలకులు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలు ఏదైనా నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని, జాయింట్ మీటింగ్ రోజు వైద్య ఉద్యోగుల పదోన్నతుల గురించి , పదోన్నతుల్లో కలిగే ఆటంకాలు గురించి చర్చిస్తామని, ఇన్స్టిట్యూషనల్ ప్రమోషన్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్, చీఫ్ రేడియోగ్రాఫర్, ఓటి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మొదలగు పదోన్నతులు జాప్యం లేకుండా చేస్తామని, రాష్ట్ర క్యాడర్ పదోన్నతులు డైటిసియన్, బయో కెమిస్ట్, లైబ్రేరియన్, నాన్ మెడికల్ అసిస్టెంట్( గెజిటెడ్) పదోన్నతులు ప్రక్రియ చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈప్రభుత్వమువైద్య రంగంలో ఏనలేని మార్పులు తీసుకొని వస్తున్న సందర్భంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి. గిరిబాబు, ఎస్ వి వైద్య కళాశాల బ్రాంచ్ అధ్యక్షులు వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV