Wednesday, 01 April 2026 04:38:30 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమగ్నం

Date : 19 August 2023 08:31 AM Views : 1400

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : * ** తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు. *చంద్రగిరి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా..* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2024 ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :