Thursday, 11 June 2026 10:46:37 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన

Date : 15 April 2026 09:01 PM Views : 484

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అకస్మిక పర్యటన చేశారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, తమ శాఖల పనితీరుని అడిగి తెలుసుకున్నారు. అలాగే రెవిన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో సందర్శించి తగిన పరిష్కారం చూపాలని, తాహశిల్దార్ ను హెచ్చరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జలధార ప్రాజెక్ట్ ప్లానింగ్ విషయమై క్షేత్రస్తాయిలో పరిశీలన చేశారు.జిల్లాలోనే చౌడేపల్లి మండలంలో ఎక్కువగా చెరువులు ఉన్నాయని,వాటికి ఫీడర్ చానళ్ళు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేశారు.ఫీడర్ చానల్ ను పరాశీలించి కాలువ గట్ల పై గల పిచ్చిమొక్కలను తొలగించాలని, వర్షాలు మొదలతే ఈ మొక్కలు, మట్టి తిరిగి కాలువలో చేరి వర్షపు నీరు ప్రవహించడం ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.ప్రతి వర్షపు బొట్టును వడిసి పట్టుకొని, నీటి భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం అని ఆయన అన్నారు.అలాగే మండలం లో గల ప్రధాన భూ సమస్యల పై వస్తున్న పిజిఆర్ఎస్ పిర్యాదులను ఏవిధంగా పరిశీలన చేసి, పరిష్కారం చూపుతున్నాని విచారణ చేశారు.రెండు మూడు సచివాలయాలలో సరిగా విచారణ చేయలేదని నిర్దారణ అయ్యిందిని అన్నారు.తర్వాత క్షేత్రస్తాయిలో దిగువపల్లి గ్రామపంచాయతీ లోగల శెట్టికుంటను సందర్శించారు. సదరు చెరువుకు గల సప్లై చానల్ ను సందర్శించారు.అనంతరం కాగతి గ్రామపంచాయతీ కాగతి చెరువును సందర్శించారు.భూసమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటిఃచి పరిష్కారం చూపాలని,భూ సమస్య పై సుదర్శన్ రెడ్డి అనే రైతు దారి విషయమై కలెక్టర్ కు విన్నవించగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారం చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమఃలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లిలామాధవి, తాహాశిల్దార్ పార్వతి, ఇరిగెషన్ ఏఈ నాగరాజు, డిఈ ఆర్డబ్యూఎస్ సురేష్, ఏఈ ఆర్డబ్యూఎస్ చందన, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్, డిప్యూటీ తాహాశిల్దార్ దొరస్వామి, దిగువపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాగతి విఆర్ఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :