Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారం ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు పీజీ వైద్య విద్యార్థులకు మెడికల్ ఎథిక్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ రాయపు రమేష్ బాబు, స్పీకర్ గా , ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్వీ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థులకు వైద్యంలో అనుసరించవలసిన పద్ధతులు, వాటి ఆవశ్యకతను గురించి అన్ని విభాగాల పీజీ వైద్య విద్యార్థులకు డాక్టర్ రాయపు రమేష్ బాబు ప్రసంగించారు. డాక్టర్ రాయపూర్ రమేష్ మాట్లాడుతూ వైద్య విద్య లోని ఎప్పటికప్పుడు వస్తున్న , కొత్త కొత్త వ్యాధులు, మెడికల్ టెక్నాలజీ తో ఎదుర్కోవలసిన వాటిలోని ఆవశ్యకతను, ప్రజలకు, రోగులకు అందించవలసిన వైద్యం పై చర్చ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న వైద్యంలో నియమ నిబంధనలకు అనుసరించి మన వైద్యం చేస్తున్నామా లేదా అని ప్రతి ఒక్క పీజీ వైద్య విద్యార్థు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో వైద్యంలో విప్లతికమైన మార్పులు వస్తున్న సందర్భాలలో పాటించవలసిన, నియమ నిబంధనల గురించి పీజీ వైద్య విద్యార్థులకు ఎథిక్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో డాక్టర్ రాయపు రమేష్ క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వైద్యం చేసేటప్పుడు వైద్యం అందించేటప్పుడు ప్రతి ఒక్క యు.జి,పి.జి, వైద్య విద్యార్థి వైద్యంపై మంచి అవగాహన నైపుణ్యముతో పేద రోగులకు ప్రజలకు , మెరుగైన వైద్యం అందించవలసిందిగా, వైద్యం లో నియమ నిబంధనలు కూడా పాటిస్తూ ప్రజలకు మంచి వైద్యం అందించవలసిందిగా ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యశాల సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పీజీ వైద్య విద్యార్థులకు వైద్యరంగంలో ఎథిక్స్, నియమ నిబంధనలు , అనుసరిస్తూ మెరుగైన వైద్యం అందించి ప్రజల దృష్టిలో 70, 80 సంవత్సరాలు వయస్సు వరకు గొప్ప వైద్యులుగా ఎదగాలని, ఎథిక్స్ కు విరుద్ధంగా పోకుండా మంచి వైద్యం అందించి , సంఘంలో గొప్ప వైద్యులుగా మెలగాలని ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు . ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరీటి, (మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం),అన్ని విభాగాల పీజీ వైద్య విద్యార్థులు, విభాగాధిపతులు, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రసూతి వైద్యశాల డాక్టర్ ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV