Thursday, 11 June 2026 10:54:35 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యూనిటీ వాక్

Date : 31 October 2023 06:52 PM Views : 1555

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చంద్రగిరి మండలం నరసింగాపురం లోని ఆర్. ఎన్. ఆర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో 2014 నుంచి జరుపుకుంటున్నామని చంద్రగిరి మండల విద్యాధికారిని లలిత కుమారి తెలిపారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం చెల్లాచెదురైన రాష్ట్రాలన్నింటినీ ఒకే దేశంగా తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని ఏక్తా దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి, పటేల్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సర్దార్ వల్లబాబ్ పటేల్ విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామూర్తి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశాన్ని విశాల భారతదేశంగా ఏకీకృతం చేయడంలో ఆనాటి భారతదేశ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు మరికొన్ని అఖండ భారతదేశంలో కలవగా నైజాం రాజు మాత్రం హైదరాబాద్‌ స్టేట్‌ తెలంగాణ కలపడానికి ఒప్పుకోలేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సంప్రదింపులు, ఒప్పందాలతోనే భారతదేశం కలవడం జరిగిందన్నారు. నడ్డి నారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారందరికి కూడా నివాళ్లు అర్పించడంతో పాటు వారిని భావితరాల వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగ సేవా సమితి అధ్యక్షురాలు నెల్లూరు మునిలక్ష్మి, పాఠశాల సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :