Famous TV - క్రీడలు / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు పట్టణంలోని ఎల్ ఆర్ బాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు బ్యాట్ మెంటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిధులు గా భారతీయ జనతా పార్టి పట్టణ అధ్యక్షులు ఎం . జగదీశ్ రాజు,మంజునాథ్ రాజు,వెంకట్ రెడ్డి,రమేష్,అభిషేక్ కుమార్,సమీవుల్లా హాజరు అయ్యి బహుమతులు ప్రధానం చేసారు.ఈ కార్యక్రమం లో జగదీశ్ రాజు మాట్లాడుతూ క్రీడాకారులు రేపటి ఛాంపియన్స్ అన్ని ట్రైనింగ్ తీసుకొని మరిన్ని టోర్నమెంట్ లో విజేతలు అవ్వాలని అకాంక్షించారు.విజేతలు బిగినర్ కేటగిరీ లో మొదటి బహుమతి దేవనిషి,ద్వితీయ బహుమతి తనూజ, తృతీయ బహుమతి రాహిని సాధించారు.ఇంటర్మీడియట్ కేటగిరి లో మొదటి బహుమతి శాన్విక, ద్వితీయ బహుమతి నెల్సన్,తృతీయ బహుమతి లక్షిణ్ సాధించారు.అడ్వాన్స్ కేటగిరీ లో మొదటి బహుమతి మనస్వి,ద్వితియ బహుమతి ఆల్విన్, తృతీయ బహుమతి అద్విక్ సాధించారు.రానున్న రోజుల్లో మరింత క్రీడా కారులను తయారు చేయడానికి,జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి, మక్రీడా పోటీలకు పంపడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ పుంగనూరుకు మరింత పేరు ప్రఖ్యాతలు తెప్పించడానికి మరింత కృషి చేస్తున్నట్టు ల్ ఆర్ బాడ్మింటన్ అకాడమీ తెలిపారు.
Admin
Famous TV