Thursday, 11 June 2026 10:44:34 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్

Date : 19 May 2026 06:02 PM Views : 313

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న పీజీఆర్ఎస్ (స్పందన) వ్యవస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా,నామమాత్రపు ఆన్‌లైన్ ప్రక్రియగా మారిపోయిందనే సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ తీవ్రమైన ఆవేదనను ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేయడం జరుగుతోంది.ప్రజలు తమ బాధలను,అన్యాయాలను,అధికారుల నిర్లక్ష్యాలను న్యాయం కోసం ఈ వేదిక ద్వారా వినిపిస్తున్నప్పటికీ,అసలు సమస్యలు పరిష్కారం కాకుండానే “రిసాల్వ్డ్,రిడ్రస్స్డ్” అంటూ ఎండార్స్‌మెంట్‌లు జారీ చేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనం.ఈ వ్యవస్థలో పని చేస్తున్న కొంతమంది అధికారులు ప్రజా బాధ్యతను మరచి,విధులను టైంపాస్ ధోరణిలో నిర్వహించడం,ఫిర్యాదులను లోతుగా పరిశీలించకుండా ఫార్మాలిటీగా మూసివేయడం,బాధితులను మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి నెట్టడం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం అందించాల్సిన వ్యవస్థే ప్రజల నమ్మకాన్ని ఛిద్రము చేస్తూ,అసంతృప్తి – అవమానం – మానసిక వేదనలకు కేంద్రంగా మారింది.పీజీఆర్ఎస్ వేదిక వల్ల ప్రస్తుతం ప్రజలకు లభిస్తున్నది పరిష్కారం కాదు,కేవలం డిజిటల్ మోసం మాత్రమే అనే అభిప్రాయం బలపడుతోంది.అంతే కాకుడా ఎవరైనా పిజిఆర్ఎస్ లో పరిష్కారం కొరకు సంతకాలు పెట్టకపోతే రాజకీయ నాయకుల వద్దనుండి బెదిరింపులు,దాడులు కూడా చేయిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు.“సమస్య పరిష్కరించబడింది”అని కాగితాలపై చూపించడం ద్వారా నిజ జీవిత సమస్యలు మాయమవ్వవు.ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం,నిబద్ధతలేని వ్యవహారం,బాధ్యతారాహిత్యం మరియు అహంకార ధోరణి, వారి విధి నిర్వహణలో పారదర్శకత,జవాబుదారీతనం ఏమాత్రము లేదు.ఈ వ్యవస్థను పూర్తిగా విఫలమయ్యే స్థితికి తీసుకువచ్చాయి.అందువల్ల,ప్రజలకు న్యాయం అందించలేని,కేవలం గణాంకాల కోసం నడుస్తున్న ఈ పీజీఆర్ఎస్ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థీకరించాలి లేదా ప్రజలకు ఉపయోగపడని స్థితిలో ఉంటే పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము.ప్రజల సమస్యలను వింటున్నట్లు నటించడం కాకుండా,వాస్తవ పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.లేకపోతే ఈ వ్యవస్థపై ప్రజల్లో తిరుగుబాటు స్థాయి వ్యతిరేకత పెరగడం అనివార్యం.“ప్రజల న్యాయం ఫైళ్లలో కాదు,వాస్తవ పరిష్కారంలో ఉండాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :