Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి, ఎస్. వి.వైద్య కళాశాల , ఆదివారము 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల మరియు ఎస్విఆర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తిరుపతి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యూనియన్ జెండా ఆవిష్కరించి వైద్య ఉద్యోగుల అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. గిరిబాబు యూనియన్ ఆవిర్భావ దినోత్సవం కి ముఖ్య అతిథిగా హాజరైన రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు గారు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ గట్టిగా కృషి చేస్తోందని,యూనియన్ నాయకులుకు సభ్యులు సంపూర్ణ సహకారం యూనియన్ నాయకులు కు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరిచాలని, పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ జీతం, డి. ఏ బకాయిలు , జి పి ఎఫ్ బిల్స్, ఏ పి జి ఎల్ ఐ బకాయిలు చెల్లించాలని,కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేయాలని, 12 వ పి ఆర్ సి రిపోర్ట్ ఆలస్యము అవుతున్న కారణంగా 36 శాతం ఐ ఆర్ చెల్లించాలని, పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించాలని,శానిటేషన్ వర్కర్ల కు సెక్యూరిటీ సిబ్బంది కి జి ఓ ప్రకారం వేతనం రూ 16,000/- చెల్లించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగులందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని కోరారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ వేసుకుని పోరాటాలకు సన్నద్ధంగా ఉండాలని గతంలో యూనియన్ పోరాటాల వల్లనే అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కే రాధ కృష్ణ , ఎస్వీ వైద్య కళాశాల బ్రాంచ్ అధ్యక్షులు వీర కిరణ్, కార్యదర్శి కె సి సుబ్రమణ్యం,రుయా బ్రాంచ్ అధ్యక్షులు సురేంద్ర , కోశాధికారి ఏ . సురేంద్ర బాబు నాయకులు లోకేష్,అమర ,సురేష్, రాజ్య లక్ష్మి,శ్రీదేవి,సుజాత భక్తవత్సలం,జనార్ధన్, బుజ్జమ్మ,సుజాత నాగమణి,ఇసాక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV