Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అక్కా - తమ్ముడు, అన్నా- చెల్లెల్ల ఆప్యాయతకు , అనురాగాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి పండుగ అని మండలం లోని పరికి దొన కు చెందిన అక్కా చెల్లెలు హేమలత, ప్రగతి అన్నారు.శనివారం వారు తమ అన్నలైన గణేష్ బాబు, నరేష్ లకు రాఖీలను కట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సోదరభావంతో,ప్రేమానురాగాలతో జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆత్మీయ బంధం వెళ్లి విరుస్తుందని అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగలో అక్కా- చెల్లెల్లు రాఖీ కట్టి అన్న, తమ్ముళ్ల ఆశీర్వాదాలు తీసుకుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధం మరింత గాఢమవుతుందని అన్నారు. ఈ ఆచారం అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతిలో భాగమై, కుటుంబ వ్యవస్థను బలపరిచే ఒక సువర్ణ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. సమాజంలో పరస్పర సహకారం, సోదరభావం, ఐక్యత పెంపొందించడంలో రాఖీ పౌర్ణమి ప్రత్యేక స్థానం కలిగి ఉందని వివరించారు. అంతేకాకుండా, ప్రస్తుత కాలంలో కుటుంబ విలువలు, సోదరభావం కొంత తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి పండుగలు కొత్తతరం యువతలో అనుబంధాలను గుర్తు చేస్తాయని, వాటిని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి రోజున ప్రతి సోదరుడు తన చెల్లెలి భద్రత, సంతోషం కోసం కట్టుబడి ఉండాలని, అది మన సంప్రదాయానికి తగిన మార్గమని తెలిపారు.
Admin
Famous TV