Friday, 12 June 2026 12:23:44 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సాంఘిక సంక్షేమ శాఖ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంక్షేమ అధికారులు పనిచేయాలి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలి: మంత్రి మేరుగ నాగార్జున

Date : 13 June 2023 05:25 PM Views : 765

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సంక్షేమ వసతి గృహ అధికారులు వారి వసతి గృహం దగ్గరలో నివాసం ఉండాలి.సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న వివిధ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగ నాగార్జున సంబంధిత అధికారులతో అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పద్మావతి అతిథి గృహం తిరుపతి నందు చిత్తూరు, తిరుపతి జిల్లాల సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, ఈడి ఎస్సీ కార్పొరేషన్, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు సాంఘిక సంక్షేమ అధికారుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణ, పరీక్ష ఫలితాలపై, కళాశాలల హాస్టల్ ల నిర్వహణ మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో ఇప్పటినుండే ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సంక్షేమ అధికారులకు సూచించారు. కళాశాలల వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహ అధికారులు వారి వసతి గృహం వద్దనే నివాసం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కళాశాలల వసతి గృహాల లోని కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా పోలీసుల సహకారంతో కౌన్సిలింగ్ నిర్వహించి వారు పెడదారిన పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు చెన్నయ్య, రాజ్యలక్ష్మి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నర్సింహులు, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు జయభారతి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :