Friday, 31 July 2026 10:33:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లాలో జగనన్న తోడు రుణాలు, వడ్డీ రీఇంబర్స్మెంట్ 40300 మంది లబ్దిదారుల ఖాతాలకు రూ. 17.57 కోట్లు జమ : జిల్లా కలెక్టర్

Date : 18 July 2023 05:59 PM Views : 523

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, జూలై17: చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం, నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడాలన్న సదుద్ధేశంతో.. నేడు మంగళవారం ఉదయం వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా (ఏడో విడత) జగనన్న తోడు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌, ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం కల్పిస్తూ , పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు అంతకు పైగా.. రాష్ట్రంలోని 5,10,412 మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 549.70 కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ. 560.73 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో గౌరవ సీఎం వైయస్‌. జగన్‌ జమ చేయగా తిరుపతి జిల్లాలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, పిడి డిఆర్డిఎ, మెప్మా అధికారులు, మహిళా లబ్ధిదారు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఈ జగనన్న తోడు పథకం ఒక వరం అని తెలిపారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు వడ్డీ రీఇంబర్స్మెంట్ ని కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని, మన జిల్లాలో డి.ఆర్.డి.ఏ ద్వారా గ్రామీణ మరియు మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల చిరు వ్యాపారులకు ఆరవ విడత జగనన్న తోడు నందు జిల్లాలో 17099 మందికి రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు రూ.17.09 కోట్ల రుణాలు అందించడం జరుగుతోందని, గతంలో వారు తీసుకున్న రుణాలకు జిల్లాలో 23,201 మంది చిరు వ్యాపారులకు సుమారు రూ. 47.86 లక్షలు వడ్డీ రీఇంబర్స్మెంట్ లబ్ది (వడ్డీ రుణ మాఫీ) జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. ముఖ్యమంత్రి తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం అందుబాటులో మూలధనం ఉంటోందని అన్నారు. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారనీ అన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. ఇప్పటికీ అర్హత కలిగి లబ్ది చేకూరని వారు వుంటే సచివాలయం లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలిసి ఆరో విడత కింద రుణాలు మరియు ఏడో విడత వడ్డీ రీయింబర్స్మెంట్ నగదు కలిపి జిల్లాలో 40300 మందికి చెందిన సుమారు రూ. 17.57 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పథక సంచాలకులు జ్యోతి, మెప్మ పిడి రాధమ్మ, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: