Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ చౌడేపల్లి జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఈ నాల్గవ స్తంభం లేకపోతే ప్రజల హక్కులు,పారదర్శకత మరియు సమాచారం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందని గుర్తు చేశారు.అలాంటి జర్నలిస్ట్ లకు సంబందించిన సమస్యలను ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు నేడు జర్నలిస్ట్ లు అందరు కలసి డిమేండ్స్ డే పాటిస్తూ అన్ని మండలాల లో తహసీల్దార్ కార్యాలయం లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు.డిమేండ్స్ లో ముఖ్యంగా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని,మీడియా కమిషన్,జర్నలిస్ట్ ల పెన్షన్,మీడియా అకాడమీ బలోపేతం చేయాలనీ, జర్నలిస్ట్ ల ఉద్యోగా భద్రత,జర్నలిస్ట్ ల ఆరోగ్య బీమా,జర్నలిస్ట్ పిల్లలకు ప్రవేటు స్కూల్లలో రాయితీ ని కల్పించాలని,జర్నలిస్టులందరికీ సకాలం లో అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరూతు చౌడేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు.సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.కార్యక్రమం లో నాగరాజ, రామారావు, ఉత్తరాది హరిప్రసాద్,రమేష్,భవాణి సింగ్,శ్రీనివాసులు,జయకుమార్,అశోక్ కుమార్,గోవిందయ్య,వెంకటేష్, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
Admin
Famous TV