Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ సి.జే.యఫ్.యస్ భూములలో జరిగిన అవక తవకలు పై కలెక్టర్ వెంటనే విచారణ ప్రారంబించి తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెకరెట్రీ నుండి ఉత్తర్వులు వచ్చాయని గతం లో ఉత్తరాది హరిప్రసాద్ ఇచ్చిన పిర్యాదు మేరకు భూములు ఆక్రమణ,డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించిన పరికరాలు,బోరు బావుల పరికరాలు అమ్ముకోవడం,వంటి వాటి పై తక్షణ విచారణ చేసి ,చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని మంగళ గిరి కమీషనరేట్ నుండి స్పెసిమన్ కాపీ నేడు పోస్టులో వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు ఈ సందర్బముగా ఉత్తరాది హరిప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడైనా మీ భూములను ఇతరులు ఎవరైనా ఆక్రమించినా,లేదా మీ భూ సమస్యలను మా దృష్టికి తెచ్చినా పరిష్కారం చూపిస్తామని,ప్రజా ప్రయోజనాల నిమిత్తం త్వరలో నూతన ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని మిత్రులు ఎక్కువ మంది మా సంస్డ లో భాగస్వాములు కావాలని నిజాన్ని నిర్బయంగా చాటుదాం అని,మన సమస్యను చట్టబద్దముగా పరిష్కరించుకుందాం అని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు..
Admin
Famous TV