Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, IPS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు ఆఫీస్ నందు గల పెరేడ్ గ్రౌండ్ నందు సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా "దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించిన అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జె.నాగేశ్వర రావు గారు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి. సిబ్బంది ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యపరమైనటువంటి ఏదైనా విషయాలు కనిపించిన వెంటనే జిల్లా పోలీస్ ఆరోగ్య కేంద్రం సేవలను వినియోగించుకోవాలని, అందరు క్రమశిక్షణతో ఉంటూ, శారీరిక దారుఢ్యం కలిగి ఉండి, ఎటువంటి విపత్తులను ఎదుర్కునేందుకైన సంసిద్ధంగా ఉండాలి. సిబ్బందికి ఉద్యోగ బాధ్యతలతో పాటు వారి సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ సంక్షేమం కోసం తక్కువ ధరలతో అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను కుటుంబ సమేతంగా వెళ్ళి వినియోగించుకోవాలని సూచన. పోలీసు శాఖ ప్రభుత్వం యొక్క ముఖ చిత్రం.. ఫిర్యాదుదారులతో మర్యాదగా, ఓపికగా వ్యవహరించాలి. పరుషంగా మాట్లాడవద్దు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు, అణగారిన వర్గాల ఫిర్యదులలో తక్షణం స్పందించాలని ఆదేశించారు. చట్టాలను తెలుసుకోవాలని సూచించి, విధులలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారి చేసారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. దర్బార్ పెరేడ్ అనంతరం 30 సం.ల పాటు పోలీస్ డిపార్టుమెంటు కు తన సుధిర్ఘమైన సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందిన శ్రీ రవీంద్రనాథ్ దేశాయ్, HG 08 గారిని హోం గార్డ్స్, మరియు వారి కుటుంబం ముఖాన అడిషనల్ ఎస్పీ గారు ఘనంగా సన్మానించారు. పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కు ఏ.ఆర్. డి.ఎస్పీ శ్రీ మురళీధర్, RI అడ్మిన్ శ్రీ నీలకంటేశ్వర రెడ్డి తదితరులు హాజరు కావడమయినది
Admin
Famous TV