Friday, 12 June 2026 01:50:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఈనెల 9వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు

రాష్ట్రంలో తొలిసారి టిడ్కో ఫ్లాట్ల ప్రారంభత్సవంలో పాల్గొంటున్న సీఎం...

Date : 07 June 2023 03:57 PM Views : 659

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : పర్యటన విజయవంతానికై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం...* *-అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు....* *-కొడాలి నాని ఇలాకాలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం సభ జరుగుతుందన్న - జోగి రమేష్...* *-అశేష ప్రజానీకంతో సీఎం సభ నిర్వహిస్తామన్న - ఎమ్మెల్యే కొడాలి నాని...* గుడివాడ:కొడాలి నాని ఇలాక అయినా గుడివాడలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుందని, గుడివాడలో నిర్వహించే సీఎం సభ కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.ఈనెల తొమ్మిదవ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు కావడంతో, సీఎం చేతుల మీదుగా జరగనున్న టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.సీఎం పర్యటన విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు, అధికార యంత్రాంగానికి పలు ఆదేశాలిచ్చారు. సీఎం సభలో పాల్గొనే ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.30 వేల మందికి నీడనిచ్చే బృహత్తర కార్యక్రమం గుడివాడలో జరగడం సంతోషకరమని మంత్రి జోగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు.లేవుట్ లో జరిగిన అభివృద్ధి పనులు, ఫ్లాట్ల నిర్మాణాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని ఆయన అన్నారు.పొరపాట్లు జరగకుండా అధికారులు బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :