Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అనేక అవమానాలు, వివక్షతలను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు.అనేక డిగ్రీలు పొంది ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వం,సమానత్వం, సౌబ్రాతృత్వాన్ని నేడు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. వేమనవిజ్ఞానకేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం అనే అనాగరిక పోకడలు పోవాలని పోరాడాడు. పశువులు త్రాగే చెరువులో దళితులు నీరుతాగితే మైలపడి పోతాయని అగ్రవర్ణాల వారు అడ్డుకుంటే అందులో నీరుతాగే హక్కు కోసం వేలాదిమందితో మహద్ చెరువు పోరాటం చేపట్టి సాధించారు. అనంతరం నడ్డి నారాయణ గారు మాట్లాడుతూ సమాజం వికసించాలంటే చదువు ప్రధానమని అన్నారు.కార్మికుల, మహిళల హక్కుల కోసం అనేక చట్టాలు తెచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు టెంకాయల దామోదరం,సుంకర రెడ్డప్ప,N.ముని లక్ష్మి, ముఖేష్,SA రఫీ,రవి, జి బాలసుబ్రమణ్యం, ఈ ఎస్ కుమార్, కలకట రెడ్డప్ప, శ్రీనివాసులు, జనార్ధన్, గురు ప్రసాద్, జ్ఞాన ప్రసూన, మోహన్ నాయుడు,S. మునిరాజు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV