Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : సమాచార హక్కు చట్టం పై కమీషనర్ కు పిర్యాదు పది సంవత్సరాల తర్వాత స్పందన చిత్తూరు ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత,జవాబుదారీ తనం ఉండాలని 2005 లో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపకల్పన చేసినది. ఐతే ప్రజలు తమ సమస్యల పైన సమాచార హక్కు కోసం ధరఖాస్తులు చేసుకోవటం వలన అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని సదరు ధరఖాస్తును పక్కదోవ పట్టించే విధముగా ధరఖాస్తుదారుడిని బెధిరించడమో, లేదా అతన్ని ఇబ్బందులకు గురిచేయడమో, లేదా రాజకీయ నాయకులు మాటలు విని అతడి పైన తప్పుడు కేసులు పెట్టడమో, లేదా అతని పైన సమాజం చీదరించుకొనేలా అసత్య కథనాలు ప్రచారం చేయడం వంటి సంఘటనలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో కర్నూలు జిల్లా లో సమాచార హక్కు చట్టం ద్వారా ధరఖాస్తు చేశాడని అతని భార్య పైన తప్పుడు కేసులు బనాయించారు. ఆవిడ తీవ్ర అనారోగ్యానికి గురైనది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మద్య డిఆర్ డిఎ అధికారులకు సమాచారం పెడితే సరైన సమాచారం ఇవ్వక తప్పుడు కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేశారు. స్థానిక గుండాల చేత సదరు ధరఖాస్తు దారుడి పై దాడులు చేయించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎప్పుడో 22 అక్టోబర్ 2016 వ సంవత్సరం లో పలమనేరు కు చెదిన మునిరత్నం అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పెడితే సమాచారం పై స్పందన లేదని కమీషనర్ కు పిర్యాదు చేస్తే 9 మార్చి 2026 కమీషనర్ స్థాయి అధికారులు స్పందించి ధరఖాస్తు పత్రాలు, నకళ్ళు తీసుకొని, కమీషనర్ ముందు హాజరు కావాలని ధరఖాస్తు దారుడికి సమన్స్ పంపారు. అంటే మన ప్రభుత్వ అధికారులు విధులు ఎలా నిర్వహిస్తున్నారో ఇట్లే అర్థమౌతుంది. అప్పీల్ నెంబర్ 4304/2017 ను ఇప్పుడు హియరింగ్ కు రావాలని సమన్స్ పంపారు.అంటే సమాచార స్థాయి కమీషన్ ఎంతటి నిబద్దతతో పనిచేస్తుందో ఆలోచించండి.తప్పు ఎవరిధి? ఇదేనా జవాబుదారీతనం అంటే ఇదేనా పారదర్శకత అంటే? ఇదేనా ప్రజల కు ప్రభుత్వాలు ఇచ్చే సందేశం, ఇదేనా సామాన్యూడికి జరిగే న్యాయం. పది సంవత్సరాల తర్వాత సమాచార కమీషన్ నుండి సమన్స్ రావడం సమాచార కమీషన్ ఎంతటి నిర్లక్ష్యం గా ఉందో ప్రజలకు అర్థమౌతుందని ధరఖాస్తుదారుడు అన్నాడు. కావున వెటనే పది సఃవత్సరాల కాలానికి ధరఖాస్తుదారుడికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Famous TV