Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి మండలం భీమవరం గ్రామం బీసీ కులస్తులు అయ్యిన కుమ్మరి కులస్తులపైన దాడిని ఖండిస్తున్నాం..రాజకీయనాయకుడు గా కాదు మనిషిగా మానవత్వంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోండి...Dr గానుగ పెంట రమేష్ ఈ రొజు (19/05/2024) శ్రీకాళహస్తి మండలం భీమవరం గ్రామం బీసీ కులస్తులు అయ్యిన కుమ్మరి కుటుంభం పైన గత వారం క్రితం ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేసిన వారిని అంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ గారు మరియు యువ సమాజ్ నిర్మాణ సేవ సంస్థ వ్యవస్థాపకులు మరియు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ చిత్తూరు అండ్ తిరుపతి ఉమ్మడి కార్యదర్శి Dr గానుగ పెంట రమేష్ మరియు పలు గ్రామాలు నుండి వచ్చిన బీసీ కుల నాయకులు,కుమ్మరి శాలివాహన నాయకులు,సేవ సంస్థ సభ్యులు పరామర్శించడం జరిగింది బెజవాడ అధిశేషేయ్య గారు మాట్లాడుతూ దాడి జరిగి 2 వారలవుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని చర్యలు తొందరగా తీసుకుని వారికి న్యాయం చేయాలని తెలిపారు అనంతరం Dr గానుగ పెంట రమేష్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దాలిసిన బాధ్యతా ఆ కుటుంభపెద్దపైన ఉంటుంది అలాగే నియోజకవర్గంలో ఏ మండలంలో అయ్యిన, గ్రామాలలో అయ్యిన,ప్రధాన పార్టీ కార్యకర్తలు,నాయకులు,తప్పుచేసిన,ప్రయోజనాలకి,స్వప్రయోజనాల కి లేదా ఆప్రయోజనాలకి మీ పేరు, అధికారం వాడిన ప్రధాన పార్టీ వారి యొక్క ఇంఛార్జి పైనే ఉంటుంది కావున శ్రీకాళహస్తి ప్రధాన పార్టి నాయకులు అయ్యిన మిమ్మల్ని మేము అర్జించటం request చేసుకోవడం ఏమనగా మీరు నిజాయతీగా శ్రీకాళహస్తి ఆర్ధిక అభివృద్ధి కోరుకునేవారే అయ్యితే మీరు జాతి, మతం,కులం, వర్ణం,వర్గం,బీసీ,ఎస్సీ,st, మైనారిటీ అనే తేడాలేదు మీకు అందరూ సమానం అని నమ్మితే.... మీరు శ్రీకాళహస్తి నియోజక వర్గంలో మహిళా అభ్యున్నతి కోరుకునే వారే అయితే...తక్షణమే ఈ ఒంటరి మహిళపైన వారి ఇంటిపైన జరిగిన దాడులను పరామర్శించి వారికి జరిగిన నష్టానికి న్యాయం చెయ్యగలరు అని కోరారు పశుభలంతో ఓటుబ్యాంకు రాజకీయాలు చెయ్యడం ఈ రోజుకు మంచి జరగొచ్చు కానీ శాశ్వత రాజకీయాలకు మంచిది కాదని తెలిపారు మరికొద్దిరోజుల్లో బీసీ నాయకులను,కుమ్మరి కుల సంఘల ఆధ్వర్యంలో చలో భీమవరం కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ నాయకులకు,శాలివాహన సంఘ నాయకులకు,సేవ సంస్థ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.
Admin
Famous TV