Friday, 12 June 2026 12:22:50 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ

Date : 09 June 2023 05:43 PM Views : 787

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి. శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని "కీ" టీవీ డైరెక్టర్ శ్రీ పరమశివన్ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ గారు., స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కాణిపాకం ఈవో మరియు డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీ వెంకటేష్ గారు ఆవిష్కరించారు.

పాఠశాలలో యోగ మరియు మెడిటేషన్ హాలుకు విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీ కంచి రఘురాం గారు భూమి పూజ చేసారు. తిరుపతి విద్యాశాఖ అధికారి శ్రీ డాక్టర్ వి శేఖర్ గారు ప్రసంగిస్తూ పాఠశాల స్థాయిలో ఇలాంటి గొప్ప వారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించడం వలన వారు సమాజానికి చేసినటువంటి సేవను గురించి విద్యార్థులకు తెలియ చెప్పవచ్చునని తెలియజేశారు.. కాణిపాకం ఈవో గారు ప్రసంగిస్తూ ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో సేవాస్ఫూర్తిని పెంపొందించవచ్చని గొప్ప గొప్ప సైంటిస్టులుగాను, మానవతావాదులుగాను తయారు చేయవచ్చునని తెలియజేశారు... పరమశివం గారి ప్రసంగిస్తూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అంబేద్కర్ జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయమని కొనియాడారు.. కంచి రఘురాం గారు ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి మానసికంగా ఎదగాలని మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలని తెలియజేశారు

రాబోయే రెండు నెలల్లో ధ్యాన మందిరాన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ధ్యానవంతులుగా అయ్యేటట్టు డ్యానామందిరాన్ని నిర్మిస్తామని తెలియజేశారు ..రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ నారాయణ స్వామి గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు దేశ నాయకులు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలని అబ్దుల్ కలాం అంబేద్కర్ మరియు వివేకానందుల జీవిత చరిత్రను తెలియజేయాలి అని తెలియజేశారు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శ్రీ ఆనంద్ గారు ఈ విగ్రహాలను పాఠశాలలు ఏర్పాటు చేసినందుకు సహకరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి జీవిత చరిత్ర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.. పాఠశాలలో కాణిపాకం EO గారి చేతుల మీదుగా ప్రగతి ఆర్గనైజేషన్ వారి సమక్షంలో బాల్యవివాహాల రద్దు సంబంధించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తిరుపతి "సేవ్" నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ప్రవీణ్ గారు ప్రగతి ఆర్గనైజేషన్ శ్రీ రమణ గారు, టిటిడి ఈఈ మనోహరం గారు, పంచాయతీరాజ్ AO కోమలేశ్వరి గారు , వే ఫౌండేషన్ అధ్యకులు డా. అంకయ్యగారు,హ్యూమన్ రైట్స్ ఇంచార్జి డా. కె. సి. కుసుమ కుమారి... కలాం ట్రస్ట్ అధ్యక్షులు భాష గారు... యువతేజం ట్రస్ట్ అధ్యక్షులు కరీముల్లా గారు... నిర్మల గారు రామరాజు గారు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :