Friday, 12 June 2026 01:49:52 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మహిళల భద్రత- రైల్వే భద్రత దళం

రైల్వే టోల్ ఫ్రీ 139 పై అవగాహన సదస్సు

Date : 27 July 2023 08:31 PM Views : 525

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ కె మధుసూదన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రైల్వే భద్రత దళం తిరుపతి వారు రాష్ట్రీయ సేవా సమితి వారి సహకారంతో రాష్ట్రీయ సేవా సమితి ఆఫీసు నందు మహిళా భద్రతపై అవగాహన సదస్సును గురువారం నాడు ఏర్పాటు చేశారు. శ్రీ నాగేశ్వరరావు, రాష్ట్రీయ సేవా సమితి కోఆర్డినేటర్, శ్రీమతి సుజాత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సఖి (ఒన్ స్టాప్ సెంటర్)చిత్తూరు, రైల్వే భద్రత దళం అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్రీయ సేవా సమితికి సంబంధించిన స్వయం సహాయక బృందం , ఒకేషనల్ కోర్సు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కె మధుసూదన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహిళా భద్రత గురించి తెలుపుతూ రైల్వే స్టేషన్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు మరియు ఇంటి నుండి తప్పిపోయిన పిల్లలను చూస్తూ ఉంటామని అంతేకాకుండా రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం చూస్తూ ఉన్నామని తెలియజేశారు. ఇటువంటి ఎన్నో సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రైల్వే భద్రత దళం వారు అనేక కార్యక్రమాలను చేపట్టారని అందులో మహిళ సురక్ష ( మేరీ సహెలి), మాతృ శక్తి, నహ్నె ఫరిస్తే ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. ఆర్ పి ఎఫ్ వారు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు చేయూతగా వారి యొక్క వివరాలను తీసుకొని వారికి యొక్క భద్రతకు కొరకు పలు రైల్వే స్టేషన్ నందు ఆర్పీఎఫ్ సిబ్బంది వారి వద్ద హాజరవ్వడం జరుగుతున్నది అని తెలియజేశారు. అంతేకాకుండా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ఆర్పిఎఫ్ ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా స్త్రీలకు వారి ప్రయాణంలో ఏ విధమైన అంతరాయం కలిగిన తక్షణమే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు సంప్రదించవలసిందిగా కోరారు. రైళ్లలో ఎవరైనా ఆకతాయిలు మహిళలపై లేక సాటి ప్రయాణికులపై దుశ్చర్యలకు పాల్పడితే రైల్వే చట్ట ప్రకారం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 సంబంధించిన వివరాలు తెలియజేశారు. తదుపరి శ్రీమతి సుజాత, అడ్మినిస్ట్రేటర్,సఖి మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతో మంది మహిళలు ఎన్నో రకాలుగా బాధింపబడుతున్నారని అటువంటి మహిళలకు వారి సంస్కృతి ద్వారా అనేక సదుపాయాలు కల్పించబడుతున్నాయి కల్పించబడతాయని తెలియజేశారు. ముఖ్యంగా నివాస, వైద్య, న్యాయ సంబంధిత సహాయాన్ని అందజేస్తారని తెలియజేశారు. అంతేకాకుండా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని, టోల్ ఫ్రీ నెంబర్ 181 గురించి తెలిపారు. శ్రీమతి శైలజ, ఉమెన్ కానిస్టేబుల్, రైల్వే భద్రత దళం చేపట్టిన మహిళ యొక్క భద్రతకు సంబంధించిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, తమ విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారు వివరించారు మహిళలగా తమ వృత్తిలో సాటి మహిళకు సహాయం చేయడం చాలా సంతృప్తికరంగా ఉందని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ నాగరాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రీయ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :