Wednesday, 01 April 2026 04:33:13 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

-ఎస్వీయూలో అలరించిన కోలాట ప్రదర్శన

Date : 17 March 2026 07:18 AM Views : 407

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : - *తెలుగు విభాగంలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం* - - *పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం* శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ - ఈతరం కవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోలాట ప్రదర్శనను ఎస్ వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి ప్రారంభించారు. ఎంఏ తెలుగు పూర్వ విద్యార్థి వెంకటేష్ నేతృత్వంలో కోలాట ప్రదర్శన అద్వితీయంగా నిర్వహించారు. భక్తి గీతాలతో కోలాట దర్శన అందర్నీ అలరించింది. కోలాట ప్రదర్శనలో డప్పు పై చక్రవర్తి, తబలాపై వెంకటరమణారెడ్డి వాద్య సహకారం అందించారు. అందరికీ ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తెలుగు విభాగంలోని ఆచార్య జియన్ రెడ్డి సెమినార్ హాల్లో ఉగాది వేడుకలు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు జక్కంపూడి మునిరత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. తెలుగు విభాగంలో పరిశోధకులుగా, అధ్యాపకులుగా ఆచార్య జక్కంపూడి మునిరత్నం ఎంతో కృషి చేశారని తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ రాజేశ్వరమ్మ కొనియాడారు. ఈతరం కవితా వేదిక గౌరవాధ్యక్షులు, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్జీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రకృతికీ మనిషికీ గల అనుబంధాన్ని గుర్తుచేసేది ఉగాది పండుగ అని తెలిపారు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈతరం కవితా వేదిక అధ్యక్షులు తోట వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ తరం యువత మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఉగాది పండుగ వసంత రుతువునూ, కోయిల పాటలను తెస్తుందన్నారు. దూబగుంట రామకృష్ణ, ఆకుల మల్లేశ్వరరావు, రెడ్డిపల్లి షాజహాన్, రవితో పాటు సుమారు 20 మంది కవులు కవితా పఠనం చేశారు. ఇందులో కె. శృతి, విద్య, బాలకృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఈ కవి సమ్మేళనానికి న్యాయ నిర్ణీతలుగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పుస్తక బహుమతులను అందజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా చేపట్టిన పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పుస్తక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు కోసూరు దామోదర్ నాయుడు, కె. మునిరత్నం, కాటూరి శారద, హెచ్ఎస్ సౌభాగ్యమ్మ, గెస్ట్ ఫ్యాకల్టీ సునీల్ కుమార్, అశోక్, ఆదిశేషయ్య, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :