Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని పరికిదొన గ్రామ పంచాయతీ, ఎగువ మల్లెల వారి పల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేష్(30) అకాల మరణం పట్ల పుంగనూరు నియోజకవర్గ నాయకులు,చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వెంకటేష్ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన గువ్వల రమేష్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిరాజు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Famous TV