Wednesday, 01 April 2026 04:35:30 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం*

Date : 28 February 2026 07:37 PM Views : 491

Famous TV - క్రైమ్ వార్తలు / పశ్చిమ గోదావరి : * - మృతుల కుటుంబాలను ఆదుకోవాలి, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి - బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ - మార్చి 2న ప్రమాద స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులకు పరామర్శించి, మృతులకు నివాళులర్పించనున్న రామచంద్రయాదవ్ మంగళగిరి: కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం, వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై భారతచైతన్య యువజన (బిసివై) పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం, అనేకమంది తీవ్రంగా గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పండుగల కోసం వెలుగులు పంచే టపాసుల తయారీ వెనుక ఇంతటి చీకటి విషాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడె రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, పొట్టకూటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న నిరుపేద కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం, సంబంధిత ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, ప్రమాదానికి కారణమైన బాణసంచా తయారీ కేంద్రం యాజమాన్యంపై, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో విఫలమైన సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కేవలం మొక్కుబడి చర్యలతో సరిపెట్టకుండా, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి, కఠినమైన, శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, రాబోయే సోమవారం, మార్చి 2వ తేదీన, బోడె రామచంద్రయాదవ్ స్వయంగా కాకినాడ వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారని, ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతులకు నివాళులర్పిస్తారని, వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదారుస్తారని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :