Thursday, 30 July 2026 10:20:59 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అపోలో యూనివర్సిటీ సంఘటన పై విచారణ

Date : 22 October 2025 07:57 PM Views : 664

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు అపోలో యూనివర్సిటీ లో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారం పై పోలీస్ విచారణ కొనసాగుతున్నదని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ వారిని కోరానని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయ భారతి సాయనీ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ ని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో తో సమీక్ష నిర్వహించారు.అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారంను వార్తా పత్రికలు, టివి చానళ్ళ ద్వారా చూసి మానవ హక్కుల ఉల్లంఘన కింద సోమోటోగా తీసుకుని విచారణకు రావడం జరిగిందని తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతున్నదని, పూర్తి వివరాలను వెలువరించలేమని అన్నారు. అనుమానితులను పోలీస్ అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారని తెలిపారు. పోలీస్ అధికారులు పారదర్శకతతో విచారణను వేగవంతం చేసి దోషులను తొందరగా న్యాయస్థానం ముందు నిలిపి శిక్షపడేలా చూడాలని కోరామన్నారు. కళాశాలలో నియమాల ప్రకారం విద్యార్థుల సమస్యల పరిష్కారానానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడగా సమస్యలెవీ లేవని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వీరితో పాటు కళాశాల ఛైర్మన్, అధ్యపకులతో సమీక్షించడం జరిగిందన్నారు.ఈ సమీక్షా సమావేశంలో లైసెన్ ఆఫీసర్లు, ఎన్ జ్యోతి, హరినాథ్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి వినోద్ బట్, డి.ఎస్.పి, సాయినాథ్, సీఐ నిత్య బాబుచీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :