Friday, 12 June 2026 01:44:16 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు

Date : 11 June 2023 10:05 AM Views : 353

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎర్రచందనం 21 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. భాకారాపేట పోలీస్ స్టేషన్ లో సీఐ తులసీరాం వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయితీ భూతంవారిపల్లి సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన తంగరాజ్, గణేష్, ఆనంద్, విజయరాసు, రాజేష్, రాజా, విగ్నేష్, తిరుపతి (8మంది) లను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు రంపాలు, మూడు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధనం చేసుకున్న ఎర్రచందనం విలువ 21 లక్షలు రూపాయల వరకు ఉంటుందని సీఐ తులసీరాం తెలియజేశారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కి తరలిస్తున్నామన్నారు. సంజూ అనే మోస్ట్ స్మగ్లర్ పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సైలు ప్రకాష్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :