Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లోని బోయకొండలో నందు ట్రాన్స్ జండర్స్ ఆగడాలు అనునిత్యం శృతిమించుతున్నాయి.బోయకొండ నందు ప్రతి ఆదివారము నిర్వహిస్తారు.ఐతే ఆదివారం ఉదయం పది గంటల నుండి వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.బోయకొండ మూడువైపులా రహాదారి విస్తరించి ఉంది.వీరు మూడు బృందాలు గా ఏర్పడి బోయకొండ లో దారి కాచి వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి మామూళ్ళు వసూలు చేస్తున్నారు.ఎవరైనా ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతూ,మేము ఏమన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని శాపనార్థాలు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉండగా ఒక ద్విచక్ర వాహన దారుడు వీళ్ళ ఆగడాలు భరించలేక ద్విచక్రవాహనాన్ని జోరుగా పోనిచ్చాడు.అతని వాహనాన్ని పట్టుకుని తోసేశారు.అంతేకాకుండా ప్రతి దుకాణం వద్దకు వెళ్ళి మామూళ్ళు వసూలు చేస్తున్నారు.ఈ విషయం బోయకొండలో చిర్లల లేదు అన్నందుకు ఆవిడ మీదకు వీళ్ళు తిరగబడ్డారు.పెద్ద గొడవే జరిగింది.అంతటి తో ఆగకుండా ఈ ట్రాన్స్ జెండర్స్ మా పైన కేసుపెట్టబో నీ అంతుచూస్తాం అంటూ అసభ్య పదజాలం తో దూషణకు దిగారు.అంతే కాకుండా హిందూపురం కు చెందిన బాలక్రిష్ణ కు చెందిన పది గ్రాముల బ్రాస్ లైట్ లాక్కున్నారని వాపోయారు.అంతేకాకుండా ఆటోలో వస్తున్న పెనుగొండ కు చెందిన నారాయణ స్వామి తన కుటుంబ సభ్యులతో వస్తుండగా ట్రాన్స్ జెండర్ మంగమ్మ,భవాని, లిఖిత లోనై దాడి చేసి సుమారు పదివేల రూపాయలు లాక్కున్నారని వాపోయారు.కర్ణాటక ,బెంగళూరు కాడిగోడి కి చెందిన దేవరాజు వద్ద కూడా నగదు లాక్కున్నారని వాపోయారు. కావున వెంటనే సంబందిత అధికారులు లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగింస్తున్న ఈ ట్రాన్స్ జెండర్ల పై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు, యాత్రికులు అంటున్నారు.
Admin
Famous TV