Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పెద్దపంజాణి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలం,రాయలపేట గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ వద్ద రాయల్పేట కె చెందిన కే.చంద్రబాబు షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతానని చెప్పి 02 లక్షలు తీసుకొని మోసం చేసి, అదే విధంగా ఇంటర్నెట్ లావాదేవీల కొరకు ఫిర్యాది లక్ష్మినారాయణ నుండి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేసుకొని చంద్రబాబు బ్యాంక్ అక్కౌంట్ తీసుకొని, చంద్రబాబు ఫోన్ నెంబర్ బ్యాంక్ అక్కౌంట్ కి లింక్ పెట్టుకొని బెట్టింగ్ ఆప్ప్ కి సదరు అక్కౌంట్ ని ఫిర్యాది కి తెలియకుండా వాడుకొని సదరు అక్కౌంట్ నుండి సుమారు కోటి రూపాయలు లావాదేవీల చేసినట్లు లక్ష్మినారాయణ ఫిర్యాదు చేయగా పెద్ద పంజాణి పోలీసు స్టేషన్ Cr.No.119/2025 u/s 316(2), 318(4),351(2),61(2),111(2)(b) BNS and Sec 66-D IT Act కేసు నమోదు చేయబడినది. సదరు కేసు విచారణలో రాజశ్రీ చిత్తూరు జిల్లా SP సూచనలతో, రాజశ్రీ పలమనేరు SDPO పర్యవేక్షణలో పలమనేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ B.పరశురాముడు, పెద్ద పంజాణి SI N.ధనుంజయ రెడ్డి మరియు పెద్ద పంజని సిబ్బంది సదరు చంద్రబాబు ను రాయల్పేట సమీపములో గల సాయి దాభా హోటల్ వెనుక శెట్టిపల్లి రోడ్ లో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజశ్రీ JFCM కోర్ట్ లో హాజరు పరచడమైనది. సదరు చంద్రబాబు పైన గతములో కూడా బెట్టింగ్ ఆప్స్ నిర్వహిస్తూన్నాడని పెద్ద పంజాణి మరియు పలమనేరు లో కేసులు నమోదు అయినవి.
Admin
Famous TV