Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేనత్త కుమారుడిని ప్రేమించినది, ఐతే అతడికి ఇచ్చి వివాహం చేయకూడదనుకున్న తల్లిదండ్రులు తమ సమీప బంధువులకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారని బంధువులు తెలియజేశారు.ఐతే సదరు మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయడం తో సదరు మైనర్ బాలిక తన ప్రియుడుతో కలసి అక్టోబర్ 27 న జంప్ అయ్యింది. ఈ క్రమంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానిక చౌడేపల్లి పోలీస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు ఈరోజు,రేపు అంటూ నిర్లక్ష్యం చేశారని, వారిని వెతికి తీసుకొని రావలసిన పోలీసులు ఊరుకున్నారని, మైనర్ బాలిక తల్లిదండ్రులే వారిని వెతికి శనివారం 1 నవంబర్ 2025 రాత్రి సుమారు ఏడు గంటలకు పోలీస్టేషన్ కు తీసుకొని వచ్చారని,కేసునమోదు చేయమంటే చౌడేపల్లి ఎస్సై దురుసుగా మాట్లాడారని,అలాగే నోటితో చెప్పుకోలేని విధంగా భూతుపురాణం మాట్లాడారని మైనర్ బాలిక బంధువులు ఆరోపించారు. అంతే కాకుండా సదరు బాలుడు కూడా మైనర్ కావడం విశేషం, బాలుడి తరపున వారి బంధువులు మాట్లాడుతూ మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు చేయడం నేరమని, వారు వివాహ ప్రయత్నాలు చేశారు కాబట్టే మైనర్ బాలిక తన ప్రియుడుతో జంప్ అయ్యిందన్నారు. ఇదిలా ఉండగా ఎస్సై బాలిక తరపు బంధువులను భూతులు తిట్టాడని, ఎస్సై డౌన్, డౌన్ అంటూ నినాదాలతో పోలీస్టేషన్ ప్రాంగణం హోరెత్తినది.వెంటనే ఎస్సై కలుగజేసుకుని బాలిక తరపున ఎవరైనా ముగ్గురు నలుగురు లోనికి రావాలని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని ఇరువర్గాలు తెలియజేశారు.ఇదిలా ఉండగా మండలంలో చాలా చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నా ఐసిడియస్ సిబ్బంది, పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారని పలువిమర్శలు వస్తున్నాయి. అవగాహన చర్యలు ఎక్కడ చేయడంలేదు.
Admin
Famous TV