Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ఏర్పేడు మండలం సీతారామ పేట వద్ద రోడ్డు ప్రమాదంలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ యెస్. లలిత మృతి చెందారు. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు ..తిరుపతి శ్రీకాళహస్తి రోడ్డుపై సీతారామ పేట వద్ద వెంకటగిరి నుండి తిరుపతికి మామిడికాయలోడుతో వస్తున్నటువంటి టాటా మినీ లారీ బ్రేకుల్ ఫైల్ అవ్వటం వల్ల ఎదురుగా వస్తున్న ఎథియోస్ కారును గుద్దుకొని పక్కనే వెళుతున్న టు వీలర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో టూవీలర్ నడుపుతున్నటువంటి లలిత (డిజిటల్ అసిస్టెంట్ వడమాల పేట) అక్కడికక్కడే మృతి చెందింది. లలిత వడమాల పేట నుండి శ్రీకాళహస్తికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదంలో అక్కడికక్కడే లలిత మృతి చెందింది. లలిత శ్రీకాళహస్తి బాలాజీ నగర్ కాలనీ వాస్తవ్యురాలు . లలిత సోదరుడు ఎస్. క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .లలిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు . లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు .
Admin
Famous TV