Thursday, 11 June 2026 10:57:43 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం

Date : 13 March 2026 07:44 PM Views : 592

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు దళిత జర్నలిస్టుపై దాడి చేయడం ప్రభుత్వ అపరాధమని,ఘటనను సీనియర్ జర్నలిస్టు పలమనేరు టి.మునిరత్నం తీవ్రంగా ఖండించారు. దినపత్రిక సూర్య జర్నలిస్టు ఉమాపతి పై అలాగే వీడియో జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి నని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతంలో భూ కబ్జాల వ్యవహారంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కొందరు రౌడీ షీటర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయ పరిచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలను ధ్వంసం చేసి, దూషించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.ప్రధానంగా జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ఘటనకు పాల్పడిన పేరూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టుపై దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 'కింద కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షింపకూడదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రౌడీషీటర్ల పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి సభ్యులు జిల్లా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఉత్తరాది హరిప్రసాద్, గిరిబాబు, శివకుమార్, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, హేమంత్, గుణశేఖర్, పలువు జర్నలిస్టులో డిమాండ్ చేశారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :