Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు దళిత జర్నలిస్టుపై దాడి చేయడం ప్రభుత్వ అపరాధమని,ఘటనను సీనియర్ జర్నలిస్టు పలమనేరు టి.మునిరత్నం తీవ్రంగా ఖండించారు. దినపత్రిక సూర్య జర్నలిస్టు ఉమాపతి పై అలాగే వీడియో జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి నని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతంలో భూ కబ్జాల వ్యవహారంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కొందరు రౌడీ షీటర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయ పరిచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలను ధ్వంసం చేసి, దూషించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.ప్రధానంగా జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ఘటనకు పాల్పడిన పేరూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టుపై దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 'కింద కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షింపకూడదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రౌడీషీటర్ల పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి సభ్యులు జిల్లా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఉత్తరాది హరిప్రసాద్, గిరిబాబు, శివకుమార్, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, హేమంత్, గుణశేఖర్, పలువు జర్నలిస్టులో డిమాండ్ చేశారు
Admin
Famous TV