Wednesday, 01 April 2026 04:42:45 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం

Date : 13 March 2026 07:44 PM Views : 431

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు దళిత జర్నలిస్టుపై దాడి చేయడం ప్రభుత్వ అపరాధమని,ఘటనను సీనియర్ జర్నలిస్టు పలమనేరు టి.మునిరత్నం తీవ్రంగా ఖండించారు. దినపత్రిక సూర్య జర్నలిస్టు ఉమాపతి పై అలాగే వీడియో జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి నని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతంలో భూ కబ్జాల వ్యవహారంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కొందరు రౌడీ షీటర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయ పరిచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలను ధ్వంసం చేసి, దూషించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.ప్రధానంగా జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ఘటనకు పాల్పడిన పేరూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టుపై దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 'కింద కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షింపకూడదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రౌడీషీటర్ల పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి సభ్యులు జిల్లా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఉత్తరాది హరిప్రసాద్, గిరిబాబు, శివకుమార్, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, హేమంత్, గుణశేఖర్, పలువు జర్నలిస్టులో డిమాండ్ చేశారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :