Thursday, 30 July 2026 10:21:50 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ

Date : 08 February 2026 07:30 PM Views : 782

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం, దిగువపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ పాదాల చెంత గల షాపింగ్ కాంప్లెక్స్ నందు వేలం పాటలో కొనుగోలు చేసిన షాపు యజమానులు తమ షాపుల ముందుగల పుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇదిలా ఉండగా షాపు యజమానులు పూర్తిగా పుట్ పాత్ ను ఆక్రమించుకొని, భక్తులు,యాత్రికులు నడవడానికి కూడా వీలులేకుండా చేశారు. దీనికి తోడు ద్విచక్రవాహన దారులు, కార్లు రోడ్లపైనే పార్కింగ్ చేయడం వలన భక్తులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు పైనే నడుస్తున్నారు. గతం లో కూడా ఇలానే ఉండగా అప్పటి ఈఓ పుట్ పాత్ పైన ఎవరు వస్తువులు పెట్టకూడదని ఆంక్షలు విధించడం జరిగింది. ఐతే ప్రస్తుతం పుట్ పాత్ పూర్తిగా ఆక్రమించుకొని షాపులు రోడ్డు వరకు విస్తరించడం వలన అటు ప్రజలు, భక్తులు, ఇటు యాత్రికులు ఇబ్బందులు పడుచున్నారు. అంతే కాకుండా రోడ్డు వరకు షాపులు ఉండటం వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. కావున సంబందించిన అధికారులు షాపు యజమానులతో మాట్లాడి పుట్ పాత్ ను పూర్తిగా పాదచారులకోసం కేటాయించే విధముగా చేయాలని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :