Thursday, 30 July 2026 10:20:46 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వాట్సప్ పింక్ లింక్ స్కామ్--ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్

Date : 11 July 2023 02:26 PM Views : 498

Famous TV - క్రైమ్ వార్తలు / : రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ సరికొత్త ఫీచర్స్, ఆప్షన్స్ తో మొబైల్స్, యాప్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు వాట్సప్ పింక్ అనే లింకును వాట్సాప్ యూజర్లకు పంపిస్తారు. పొరపాటున ఆ లింకును క్లిక్ చేయగానే వాట్సప్ అప్డేట్ అవుతున్నట్లు గ్రీన్ కలర్ వాట్సాప్ లోగో బ్యాక్ గ్రౌండ్ పింక్ కలర్ లోకి మార్పు చెందుతుంది. అప్పటి నుండి మొబైల్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు, బ్యాంకు వివరాలు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం అంటూ వ్యక్తిగత వివరాలను సేకరించి మొబైల్ నెంబర్ కు ఓటిపి ని సైబర్ నేరగాళ్లు పంపుతారు. మెసేజ్ వచ్చిన ఓటీపీని మొబైల్ నందు ఎంటర్ చేయగానే మన మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేత రిమోట్ కంట్రోల్ యాక్సెస్ చేయబడుతుంది, మీ మొబైల్ మీ నియంత్రణ కోల్పోయి సైబర్ నేరగాళ్ల చేత నియంత్రించబడుతుందని తెలిపారు. తర్వాత గంటల వ్యవధిలోనే బ్యాంకు అకౌంట్ లో ఉన్న నగదు మాయం అవుతూ వస్తుంది. మీ కాంటాక్ట్ నెంబర్లకు తరచుగా పింక్ వాట్సప్ లింక్ ఫార్వర్డ్ చేయబడుతూనే ఉంటుంది. మీ కాంటాక్ట్ నెంబర్లలో వాట్సాప్ వాడే మొబైల్ యూసర్లు అందరికీ వాట్సప్ పింక్ లింకు క్లిక్ చేసేంతవరకు ఫార్వర్డ్ అవుతూనే ఉంటుందని అన్నారు. ప్రజలు ఎవరైనా ఈ తరహాలో మోసపోయి ఉంటే వెంటనే గోల్డెన్ అవర్ లోగా సైబర్ సెల్ కంప్లైంట్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా తిరుపతి సైబర్ సెల్ పోలీస్ వారికి ఫిర్యాదు చేసినట్లయితే సకాలంలో బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :