Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ఫిర్యాదు ద్వారా రూ. 72,00,000/- విలువగల 400 మొబైల్ ఫోన్లు రికవరీ. CEIR (Central Equipment Identity Register) పోర్టల్ గురించి ప్రజలకు అవగాన కల్పిస్తున్నము CEIR CITIZEN PORTAL ద్వారా మొబైల్ పోయిన వెంటనే పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది, అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్., వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT (WHATSAPP) 9490617873 సదరు వాట్సప్ కు వచ్చిన పిర్యధులపై ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 04 విడుతలగా 780 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది. వీటి విలువ రూ. 1,40,40,000/-. “5వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన 400 మొబైల్ ఫోన్లను (వాటి విలువ సుమారు రూ. 72,00,000/-)” శనివారం ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్., గారు వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు 05 విడతలకు గాను మొత్తం 1,180 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినారు. వాటి విలువ సుమారు రూ.2,12,40,000/-.
ప్రజల ఎవ్వరిదైనా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 Whatsapp లో Hai లేదా HELP అని మెసేజ్ చేస్తే వచ్చే link నందు మీ యొక్క వివరాలను పూరించాలి లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు అన్నారు. రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.యస్., గారి యొక్క ఆదేశాల ఫై తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్., గారి పర్యవేక్షన లో తిరుపతి సైబర్ క్రైమ్ సి.ఐ. ఓ.రామచంద్ర రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక నిపుణులను బృందం ను ఏర్పాటు చేసీ పోగుటుకున మొబైల్స్ ను రికవరీ చేసి భాదితులకు అందజేయడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా పోలీసు MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు CIER పోర్టల్ గురించి పోలీసులు ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా కల్పిస్తున్నారు. మీడియా కూడా తమవంతు సహకారం అందించాలని కోరుచున్నాము. తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. సెల్ ఫోన్లు దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి, దీనిని గమనించి MOBILE HUNT అను WEB-LINK ను ప్రవేశ పెట్టడం జరిగింది. మొబైల్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయుటకు ఇబ్బందికర ఉన్నందున ఈ MOBILE HUNT అను WEB-LINK ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ WEB-LINK నందు పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్ యొక్క సమాచారంను తెలిపిన యెడల సైబర్ క్రైమ్ వారు వాళ్ళ యొక్క సెల్ఫోన్లను రికవరీ చేయడం జరుగుతుందన్నారు.మొబైల్ పోగొట్టుకున్న వారు వెంటనే ఈ యొక్క WEB-LINK లో రిజిస్టర్ చేయడం ద్వారా వారి యొక్క సెల్లును బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వేరే వాళ్ళు ఈ యొక్క మొబైల్ ను వాడిన వారి యొక్క సమాచారం మనకు వెంటనే వచ్చును కావున ఈ యొక్క MOBILE HUNT WEB-LINK ను సద్వినియోగం పరుచుకోవాలని మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఇప్పటివరకు మనకు వచ్చిన ఫిర్యాదులలో 50% మాత్రమే రికవరీ అయినది మిగిలినవి త్వరలో రికవరీ చేస్తామన్నారు.
సైబర్ నేరాలు కూడా తగ్గుముఖం పట్టిందని, దిశా పోలీస్ వారు, మహిళా సంరక్షక పోలీస్ వారు కలిసి సమన్వయంతో పట్టణాలతో పాటు ప్రతి గ్రామంలో విస్తృతంగా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం సత్పలితాన్ని ఇచ్చింది. ఇంకా ప్రజల్లో ఇంకా కొంత మేర అవగాహన లోపం ఉంది. వాటిని కూడా పూర్తిగా తొలగించి మెరుగైన ఫలితాలను సాదిస్తాము. తిరుపతి విధ్యాసంస్థలున్న నగరం. విధ్యార్థులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈవ్ టీసింగ్, ర్యాగ్గింగ్ మొదలగు ఘటలను జరగకుండా దిశా పోలీసులు బృందాలుగా ఏర్పడి గట్టి చర్యలు తీసుకుంటుంన్నారు. ఏదైనా అనుకోని ఘటనలు జరిగినప్పుడు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి. అలా చేసినప్పుడే పోలీస్ వారు సకాలంలో భాదితులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లి దండ్రులు భాద్యతగా ఉండాలి. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సత్ప్రవర్తన మార్గంలో నడిచే విధంగా హితబోధ చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ టీమ్ పోలీసులు MOBILE HUNT & CEIR (Central Equipment Identity Register) ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారని, సైబర్ క్రైమ్ పోలీసులను జిల్లా ఎస్పీ గారు శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులకు మరియు సైబర్ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించినారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు అడ్మిన్ శ్రీ వెంకట్రావు గారు, L&O శ్రీ కులశేఖర్ గారు, క్రైమ్ శ్రీమతి విమల కుమారి మేడం గారు, సైబర్ సి.ఐ రామచంద్ర రెడ్డి, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV