Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, మార్చి 17: అమర రాజ సంస్థ తరపున రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సభలో ప్రముఖ పాత్రికేయుడు, కథా రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ను మాండలిక బ్రాహ్మ అవార్డు తో సత్కరించారు. ఈ సమావేశం లో విశిష్ట అతిథి, తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ…. నామిని మాకు మార్గదర్శి. ఆయనను అనుసరించడం కష్టం.మహారచయిత, నామిని సరసన కూచోవడం అదృష్టం. తెలుగు వచన రచన ను శాసించాడు. నామిని ఊహాశక్తి గొప్పది అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు తాడి ప్రకాష్ మాట్లాడుతూ… రచయితలు అందరికీ అభిమానులు ఉంటారు. నామిని కి మాత్రమే ఆత్మాహుతి దళాలు ఉంటాయని అన్నారు.. కాళోజీ అభినందనలు అందుకున్నాడు. బాపు మెప్పు పొందాడు. పతంజలి ప్రోత్సాహం తో పచ్చనాకు సాక్షిగా రాయించారు. అందులో ప్రతి వాక్యం చదువుకున్నాం.అప్పటికి పేరున్న గొప్ప రచయితల్ని బయటికి పంపిన వాడు అన్నారు. ప్రజా గాయకుడు పెంచల దాసు మాట్లాడుతూ… అమ్మగురించి గొప్పగా రాసిన వాడు నామిని. ఆయన రాసిన మాండలిక భాష మాకు ప్రేరణగా ఉండేది. ఆయన ఉన్న కాలం లో ఉండడం మన అదృష్టం అన్నారు. సభకు అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ… అక్షరానికి పట్టాభిషేకం జరుగుతున్న రోజు, మాండలిక బ్రంహోత్సవం. రాజగోపాల్ నాయుడు ఎంతో అనుభందం ఉంది. రాజకీయ, సాహిత్య, సేవా రంగాలలో అవిశ్రాంతంగా పనిచేశారు. ఇక నామిని ఈ పురస్కారం ఇవ్వడం మన అదృష్టం అన్నారు. చివరగా రాజన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గల్లా రామ చంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి, డాక్టర్ గౌరినేని రమాదేవి తదితరులు నామిని దంపతులను మాండలిక బ్రాహ్మ అవార్డు తో స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. చివరగా నామిని మాట్లాడుతూ.. ఈ బిరుదు నా కంటే ముందు తరం రచయితలు గురజాడ, చలం, చాసో, కేశవ రెడ్డి, వంటి ఎందరో ప్రముఖ రచయితలకు చెందుతుంది. అన్నారు తొలుత బొందు రామచంద్ర రెడ్డి ఉద్దీపన గీతం తో సభ ప్రారంభం అయ్యింది. డాక్టర్ సాకాం నాగరాజ స్వాగతం పలికారు. సబ్ రిజిస్ట్రార్ కొండారెడ్డి, జీ. కె.యస్. రాజ ప్రసంగించారు. ఈ కార్య క్రమం లో నామిని కుటుంబ సభ్యులు, అరసం తిరుపతి జిల్లా ప్రతినిధులు యువశ్రీ మురళి, నేమిలేటి కిట్టన్న, వాకా ప్రసాద్, వేమూరి జయరాం ప్రసాద్, పురందర నాయుడు, గొర్రెపాటి రమేష్, పేరూరు బాల సుబ్రమణ్యం, పలువురు సాహితీ ప్రియులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
Famous TV