Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండల కేంద్రము లో గల చౌడేపల్లి ఒకటి సచివాలయ విలేజ్ హెల్త్ క్లినిక్ లో వైద్యాధికారి డా పవన్ కుమార్ అతిసార వ్యాధి గురించి ర్యాలీ మరియు సమావేశం నిర్వహించారు. ఈగలు వాలిన ఆహారం తీస్కోవడం,కలుషిత ఆహరం నీరు తీసుకోవడం వలన వాంతులు వీరేచనాలు కలుగుతాయని తెలిపారు. స్టాప్ డయేరియా కార్యక్రమం 16.6.25 నుండి 31.7.25 వరకు జరుగుతుందని చెప్పారు. అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో కార్యక్రమం.ఓ.ఆర్.యస్ ద్రావణం త్రాగాలని,ఓ.ఆర్.యస్ ద్రావణం చేసుకొనే విధానం వివరించారు. బాగా కడిగిన తర్వాతనే పండ్లు,కూరగాయలు వినియోగించాలని చెప్పారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు.బాగా ఉడికించిన తర్వాతే ఆహరం తీసుకోవాలని తెలిపారు. కారుక్రమంలో సూపర్ వైజర్ బహువుద్దీన్,జమున,యం.యల్.హెచ్.పి.ఏ.యన్.యం లు,అశా కార్యకర్తలు పాల్గొన్నావారు.
Admin
Famous TV