Friday, 12 June 2026 12:18:46 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

భారతదేశం ప్రస్తుతం ODI క్రికెట్ అంటే ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం

Date : 21 October 2023 06:04 PM Views : 511

Famous TV - క్రీడలు / : Olympics 2036: భారతదేశం ప్రస్తుతం ODI క్రికెట్ అంటే ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. అయితే, వీటి తర్వాత భారత్ దృష్టి క్రీడల మహాకుంభ్ అంటే ఒలింపిక్ క్రీడలపై నెలకొంది. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెప్పుకొచ్చారు. ముంబైలోని వరల్డ్ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో మోదీ ఈ విషయం చెప్పారు. భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కాకుండా, భారతదేశం 1982లో న్యూఢిల్లీలో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఒలింపిక్ క్రీడలు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం గురించి నరేంద్ర మోడీ చాలాసార్లు మాట్లాడారు. కానీ, IOC సెషన్‌లో, మోడీ అధికారికంగా భారతదేశం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘ఏ అవకాశాన్ని వదిలిపెట్టను’ ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్‌ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు. ఈ క్రీడలు ఛాంపియన్‌లను సృష్టించడమే కాకుండా శాంతిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా 2029లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఐఓసీ నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ రెండోసారి ఐఓసీ సెషన్‌ను నిర్వహిస్తోంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :